వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యభిచారం నెపంతో మహిళను వివస్త్రను చేసి చితకబాదారు

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో మంత్రాలు, వ్యభిచారం నెపంతో గౌరీబాయి అనే మహిళపై గ్రామస్థులు అత్యంత దారుణంగా దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి చితకబాదారు.

వివరాలు ఇలా ఉన్నాయి - కళ్యాణి దుర్గానికి చెందిన గౌరీబాయి పది సంవత్సరాల క్రితం హిందూపురం ప్రాంతానికి వలస వచ్చింది. వడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్‌ వేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే ఇదే స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని స్థానికులు బావించారు.

ఈ క్రమంలో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా గ్రామస్థులు ఆమెతో గొడవ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు మహిళకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామస్థులు మంగళవారం నాడు మహిళపై దాడికి పాల్పడ్డారు.

Woman was beaten by villagers in Ananthapur district

ఇంట్లోని వస్తువులన్నింటినీ బయటపడేసి, ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే, గ్రామస్థులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఆ మహిళ మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. దానికితోడు, ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకుని వ్యభిచారం నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు.

English summary
A woman has been beaten by villagers in Ananthapur district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X