వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోషల్ మీడియాలో రోజాపై తప్పుడు ప్రచారం: చర్యకు రె'ఢీ'
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సామాజిక మాథ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఆమె చనిపోయిందంటూ మార్పింగ్ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు చ
అమరావతి:వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సామాజిక మాథ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఆమె చనిపోయిందంటూ మార్పింగ్ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు చేయనున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.
తన రాజకీయ శత్రువులే ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తాను మరణించినట్టు ఫోటోలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు రోజా చెప్పారు.
అసెంబ్లీలో తాను దీక్ష సమయంలో ఆసుపత్రిలో ఉన్న పోటోలను మార్పింగ్ చేశారని రోజా అభిప్రాయడ్డారు. ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నవారెవరో అర్ధం కావడం లేదన్నారు.
ఈ ఘటనకు బాధ్యలు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కోరనున్నట్టు ఆమె చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
English summary
wrong publicity against Ysrcp Mla Roja in social media.. Roja will complaint against this wrong publicity.
Story first published: Thursday, August 10, 2017, 20:17 [IST]