‘రోజా వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి’: యామిని హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వ విప్ యామినీ బాల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రభుత్వం భయపడ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వ విప్ యామినీ బాల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రభుత్వం భయపడుతోందన్న రోజా వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. రోజాకు చట్టమన్నా.. చట్టసభలన్నా గౌరవం లేదని ధ్వజమెత్తారు. కాకతాళీయంగా జరిగిన రోడ్డుప్రమాదాన్ని రాజకీయం చేస్తూ.. కలెక్టర్, వైద్యులను తోయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రౌడీయిజం, గూండాయిజంతో గుర్తింపు పొందాలనుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్పై నిత్యం అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. రోజూ మహిళల గౌరవానికే భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే రోజాకు మహిళలే బుధ్ది చెబుతారని హెచ్చరించారు.
కోర్టుకు హాజరైన రోజా
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. ప్రైవేటు పిటిషన్పై విచారణ కోసం ఆమె కోర్టుకు వచ్చారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ పోలీసులపై రోజా ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.