వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రతిపాదన యోచనలో వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

సస్పెన్షన్‌ను ఎత్తేయడానికి అధికార టిడిపి ససేమిరా అనడంతో వైసిపి శాసనసభా సమావేశాలను బహిష్కరించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తమకు సభలో మాట్లాడే అవకాశం తిరిగి వస్తుందనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

తమకు తగిన బలం లేకపోవడం వల్లనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఇంతకు ముందు జగన్ అన్నారు. కానీ, మనసు మార్చుకుని ఆయన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు మొగ్గుచూపినట్లు చెబుతున్నారు.

YCP may propose no confidence motion on speaker

కాల్ మనీపై కూడా చర్చ పూర్తి కాలేదని వైయస్ జగన్ అభిప్రాయపడుతున్నారు. అయితే, కాల్ మనీపై చర్చ ముగిసిందని అధికార టిడిపి వాదిస్తోంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

రోజా సస్పెన్షన్‌పై శాసనసమండలిలోనూ వైసి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తాము సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

English summary
It is said that YSR Congress party president YS Jagan is in a bid to propose no confidence motion on Andhra Pradesh speaker Kodela Sivaprasad Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X