రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్‌ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి వేధింపు, ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పలువురు యువకులు సెల్‌ఫోన్‌లో అసభ్యంగా చిత్రీకరించి, లైంగికంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆదివారం నాడు చోటు చేసుకుంది.

రాజమండ్రి శానిటోరియం ప్రాంతంలో యువతి ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు ఆరుగురు యువకుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

youth harassed, woman commits suicide

ఉష అనే వివాహితకు చెందిన ఫోటోలను బాలాజీ అనే యువకుడు అతడి స్నేహితులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. వీటి ద్వారా ఆమెను తరుచూ వేధిస్తున్నారు. ఆ వేధింపులు భరించలేక ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. ఉరివేసుకునే ముందు ఆమె పోలీసులకు లేఖ రాసింది.

బాలరాజు, అతని స్నేహితులు తనను మానసికంగా వేధించారని ఆమె అందులో పేర్కొన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

పెళ్లైన ఆరు నెలలకే సురేష్ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. భార్య గర్భవతి. దీంతో ఆమెకు తాటి ముంజలు ఇచ్చేందుకు చెట్టు ఎక్కాడు. అక్కడ నుంచి పడి ప్రాణాలు విడిచాడు. ఈ విషాదం గుంటరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరులో శనివారం జరిగింది.

English summary
youth harassed, woman commits suicide in Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X