కొత్త అసెంబ్లీపై జగన్ ఆసక్తికరం, గవర్నర్ టీ అడిగితో బడ్జెట్ లేదన్నారు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన అసెంబ్లీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బాగుందని కితాబిచ్చారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన అసెంబ్లీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బాగుందని కితాబిచ్చారు.
అసెంబ్లీ బాగానే ఉందని, కానీ బయట గదులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ భవనాన్ని తాత్కాలికంగా ఉంచడం కంటే ఇదే భవనాన్ని శాశ్వతంగా ఉంచితే బాగుంటుందని చెప్పారు.
గవర్నర్ టీ అడిగితో నో!
ఏపీ అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం గవర్నర్ నరసింహన్ టీ కావాలంటే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ లేదని సరదాగా చెప్పారు.
ఇదీ జగన్.. అందుకే టిడిపిలో చేరా, అఖిలకు మంత్రి పదవి ఒకే: భూమా
నూతన సచివాలయంలో బడ్జెట్ ప్రసంగం చేశారు గవర్నర్ నరసింహన్. అనంతరం ఆయన వెళ్తూ.. తనకు 'టీ' కావాలని అడిగారు. ఇక్కడ టీ ఇచ్చే సంప్రదాయం లేదని, కోరితే మాత్రం వెంటనే సమకూర్చుతామని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కలుగజేసుకొని.. బడ్జెట్ చాలా తక్కువగా ఉందని, అందుకే టీ అరేంజ్ చేయలేకపోయామని చెప్పారు. దీంతో గవర్నర్తో పాటు అక్కడున్న వారంతా నవ్వేశారు.