ఆ భయంతోనే నా మైక్ కట్ చేస్తున్నారు: వైయస్ జగన్
అగ్రిగోల్డ్ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నేత, వైయస్సా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తనపై కేసులకు సంబంధించి విసిరిన సవాల్కు ప్రభుత్వం నోరు విప్పలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు బయటకు వస్తే మంత్రి పుల్లారావు సహా అధికార పార్టీ నేతల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు.
అందుకే
తాను
మాట్లాడటానికి
ప్రయత్నిస్తే
మైక్
కట్
చేస్తున్నారన్నారు.
సభను
ముందుకు
తీసుకెళ్లాల్సిన
స్పీకర్
ఆ
పని
చేయడం
లేదని,
సభ
విలువలను,
గౌరవాన్ని
అధికార
పక్షం
దిగజార్చుతోందని
మండిపడ్డారు.
అగ్రిగోల్డ్
కేసులో
ఇంకా
చాలా
మంది
నేరస్తులను
అరెస్ట్
చేయలేదని
అన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సభముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే... తన ప్రయత్నాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సభలో పుల్లారావు భూముల కొనుగోలుపై తాను ఆధారాలు ప్రవేశపెట్టాక.. తర్వాత వాళ్ల దగ్గర గొప్ప ఆధారాలుంటే సభలో ఇవ్వొచ్చన్నారు.
ఇద్దరి వాదనలు విన్నాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని జగన్ అరు. అయితే ఆ అవకాశాన్ని స్పీకర్ తమకు ఇవ్వడం లేదన్నారు. నీటి కుళాయిల దగ్గర సవాళ్ల మాదిరిగా విసురుతున్న సవాళ్లకు అర్థం లేదన్నారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్కు ప్రభుత్వం పారిపోయిందని జగన్ అన్నారు.