నేతల వాగ్యుద్ధం, సర్ది చెప్పిన జగన్: కడప జిల్లా పరిస్థితులపై ఆరా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుటే వైసిపి నేతలు బాహాబాహీకి దిగారు. నీటి అంశంపై ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుటే వైసిపి నేతలు బాహాబాహీకి దిగారు. నీటి అంశంపై ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
తమ గ్రామానికి మంచి నీటిని సరఫరా చేయకుండా పక్కనున్న రామన్నూతల పల్లెకు నీటిని తరలిస్తున్నారని సర్పంచ్ నాగేంద్ర రెడ్డిని మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు.
అమెరికాలో కమ్మ-రెడ్డి క్రికెట్ మ్యాచ్ ఏమయిందంటే..: కట్జూ ట్వీట్
ఎంపీడీవో పైనా శివశంకర్ రెడ్డి విరుచుకు పడ్డారు. దీతో వివాదం మొదలైంది. జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సంఘటన గురువారం జరిగింది.
జిల్లా పరిస్థితులపై ఎమ్మెల్యేల నుంచి జగన్ ఆరా
రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ రెడ్డిలతో జగన్ భేటీ అయ్యారు. వారితో జిల్లా పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. అలాగే, రాజకీయ పరిస్థితుల పైనా ఆరా తీశారు.