ఆయన మనిషి కాదా: 'సారీ'పై వైసిపి, బాబు సెటిల్మెంట్ చేశారని టిడిపి నేతలే..
రవాణా శాఖ కార్యాలయం ఘటనలో టిడిపి నేతలు అధికారులకు క్షమాపణ చెప్పారు సరే గానీ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారని, ఆయనకు ఎందుకు చెప్పలేదని వైసిపి సభ్యులు అనిల్ యాదవ్ నిలదీశారు.
విజయవాడ: రవాణా శాఖ కార్యాలయం ఘటనలో టిడిపి నేతలు అధికారులకు క్షమాపణ చెప్పారు సరే గానీ కానిస్టేబుల్ పైన దాడికి పాల్పడ్డారని, ఆయనకు ఎందుకు చెప్పలేదని వైసిపి సభ్యులు అనిల్ యాదవ్ నిలదీశారు.
చెవిరెడ్డి ఎక్కడ, ఆ ట్రావెల్స్ నాదని నిరూపిస్తారా.. రిజైన్ చేస్తారా: బాబుకు జగన్
ఆయన సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. టిడిపి నేతలు ప్రజా సమస్యల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లలేదన్నారు. ఐపీఎస్ పైన దాడి చేసి సారీతె సరిపెడతారా అని నిలదీశారు.
రాష్ట్రంలో చట్టం లేదనుకుంటున్నారా అన్నారు. అధికారులకు టిడిపి నేతలు క్షమాపణలు చెప్పారని, మరి కానిస్టేబుల్ మనిషి కాదా.. ఆయనకు సారీ చెప్పరా అన్నారు. సీఎం గారే సెటిల్మెంట్ చేసినట్లుగా చెబుతున్నారన్నారు.
సీఎం సెటిల్ చేశారని టిడిపి నేతలే చెబుతున్నారన్నారు. టిడిపి నేతలు ప్రయివేటు పనుల కోసం వెళ్లి దాడి చేశారన్నారు. నాడు మహిళా ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టి లాగితే చంద్రబాబు తన ఎమ్మెల్యేను కాపాడారన్నారు.
కేశినేని నాని వీరంగం: జగన్ను లాగిన చంద్రబాబు, వైసిపి చీఫ్ ట్రావెల్స్కు షాక్!
నందిగామ ఇష్యూను ఇక్కడకు లాగడం సరికాదన్నారు. ఆ రోజు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అమాయకులు చనిపోతే జగన్ అధికారిని నిలదీశారని చెప్పారు. ఆనాడు ప్రజల కోసమే జగన్ అడిగారన్నారు. చంద్రబాబు హయాంలో పోలీసులకే రక్షణ లేదన్నారు.