ప్రైవేట్ బస్సు-కంటెయినర్ ఢీ: 10మంది మృతి(పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలోని శూలగిరి గ్రామ సమీపంలో హోసూరు నుంచి కృష్ణగిరి వైపు వస్తున్న శ్రీదేవి ప్రైవేటు బస్సు, కృష్ణగిరి నుంచి హోసూరు వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొనడంతో బస్సు సగభాగం నుజ్జునుజ్జయింది.
దీంతో ఎనిమిది మంది అక్కడకక్కడే మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు. 28 మంది హోసూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని హోసూరు పోలీసులు పేర్కొంటున్నారు.
క్షతగాత్రులో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీరిలో కూడా మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ఘోర ప్రమాదం
తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘోర ప్రమాదం
కృష్ణగిరి-బెంగళూరు జాతీయ రహదారిలోని శూలగిరి గ్రామ సమీపంలో హోసూరు నుంచి కృష్ణగిరి వైపు వస్తున్న శ్రీదేవి ప్రైవేటు బస్సు, కృష్ణగిరి నుంచి హోసూరు వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొనడంతో బస్సు సగభాగం నుజ్జునుజ్జయింది.
ఘోర ప్రమాదం
దీంతో ఎనిమిది మంది అక్కడకక్కడే మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు.
ఘోర ప్రమాదం
28 మంది హోసూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని హోసూరు పోలీసులు పేర్కొంటున్నారు.