పదేళ్ళ బాలికకు కడుపులో రాళ్ళున్నాయని వెళ్తే బిడ్డ పుట్టింది
చంఢీగఢ్: దగ్గరి బంధువు చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఓ పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కడుపులో రాళ్ళున్నాయని ఆపరేషన్ చేయాలని ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువస్తే గర్భవతిగా తేలింది. అయితే పదేళ్ళ వయస్సులోనే ఆ బాలికకు గర్భస్రావం చేసేందుకుగాను సుప్రీంకోర్టు గత నెల 28న, నిరాకరించింది.
దీంతో చంఢీఘడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్టు, పిడియాట్రిషియన్ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్పర్సన్ డాక్టర్ దాసరి హరీష్ తెలిపారు.
ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్ సజావుగా సాగిందని, శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలోనే ఉంచినట్టు వైద్యులు చెప్పారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు.
వైద్య ఖర్చులను ఛండీఘడ్ పాలనయంత్రాంగం భరిస్తోంది. భాలిక భవిష్యత్తు దృష్ట్యా బిడ్డను దత్తత ఇవ్వాలని ఆమె తండ్రి ఆసుపత్రి వర్గాలను కోరారు.