వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్: దళిత బాలికపై 12 మంది విరుచుకుపడ్డారు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నగ్లా సంత గ్రామంలో 14 ఏళ్ల బాలికపై 12 మంది కీచకులు విరుచుకుపడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆగస్టు 20వ తేదీన చోటు చేసుకుంది. బాలిక పొలానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

దండగులు బాలికను బెదిరించి పట్టపగలు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సురేంద్రతో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను ఎవరినీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Girl raped

ఇదిలావుంటే, ఒడిసాలోని భువనేశ్వర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవరు స్కూల్లోని మరుగుదొడ్లో లైంగిక అకృత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది. గంగపడ ఏరియాలో బాలిక ఆడుకుంటుండగా బుజ్జగించి అతను ఆమెను తీసుకుని వెళ్లాడు.

నిందితుడిని అరెస్టు చేశామని, బాలిక అతన్ని గుర్తించిందని, కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు.

English summary
A 14-year-old girl was allegedly gangraped by twelve persons in Nagla Sant village police said on Friday. The incident took place on August 20 when the girl had gone to the fields and 12 persons allegedly threatened to kill her and raped her in broad daylight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X