శృంగేరీ 37వ పీఠాధిపతిగా విధుశేఖర, గుంటూరుజిల్లాకు చెందినవారు
చిక్మగ్ళూరు: కర్నాటకలోని శృంగేరీ శారదాపీఠం అధిపతి భారతీ తీర్థస్వామి వారసుడిగా విధుసేఖర స్వామి సన్యాసం స్వీకరించారు. గురువారం నాడు ఆరంభమైన సన్యాస స్వీకారోత్సవం శుక్రవారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అనంతవరానికి చెందిన కుప్పా వెంకటేశ్వర ప్రసాద్ శర్మను భారతీతీర్థ స్వామి వారసుడిగా ఎంపిక చేశారు.
సన్యాస స్వీకారం అనంతరం ఆయన పేరును విధుశేఖర భారతిగా మార్చారు. ధార్మిక సంప్రదాయాల ప్రకారం సన్యాస స్వీకారోత్సవం నిర్వహించారు. విధుశేఖర తుంగా నదిలో స్నానాదులను పూర్తి చేశారు. అనంతరం విద్యాశంకర ఆలయాన్ని సందర్శించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధుశేఖర భారతీ స్వామి శృంగేరీ శారధాపీఠం 37వ మఠాధిపతి. విధుశేఖర భారతి వయస్సు ప్రస్తుతం 22 ఏళ్లు. శృంగేరీ శారధాపీఠం తుంగ ఒడ్డున, బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఆదిశంకరాచార్య ఏర్పాటు చేశారు.
విధుశేఖర భారతి సన్యాస స్వీకరోత్సవానికి దేశవ్యాప్తంగా దాదాపు యాభై వేల మంది హాజరయ్యారు. ప్రస్తుతం భరతీ తీర్ష స్వామి వారు శృంగేరీ పీఠాధిపతిగా ఉన్నారు. వారు అభినవ విద్యా తీర్థ స్వామీజీ (35వ పీఠాధిపతి) నుండి 1974లో స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలను కొత్త పీఠాధి పైన పెడుతున్నట్లు చెప్పారు.
At
Shishya
Sweekara
ceremony
in
Sringeri.
Unbroken
chain
from
Adishankara
8th
Century.
#Blessed
pic.twitter.com/oNr3rx76hm
—
Anil
Kumble
(@anilkumble1074)
January
23,
2015