వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: తుపాకీ చూపి కారు చోరీ, ఉగ్రవాదులేనా?

|
Google Oneindia TeluguNews

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. సుజన్‌పూర్‌ ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఓ స్థానికుడి కారును అపహరించారు. దీంతో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఈ ఏడాది జనవరిలో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ ఘటనకు ముందు కూడా కొందరు ఉగ్రవాదులు ఓ పోలీస్‌ అధికారి కారును దొంగలించిన విషయం తెలిసిందే.

3 armed men steal civilian's car at gunpoint in Pathankot

తాజా ఘటనలో పఠాన్‌కోట్‌-జమ్ము హైవేలో వెళ్తున్న కారును ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. పెట్రోల్ కావాలని అడిగి.. తర్వాత నాటు తుపాకీలతో కారు యజమానిని బెదిరించి కారును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది ఉగ్రవాద ఘటన కాదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశామని వెల్లడించారు.

English summary
A car was snatched at gunpoint by three youths today near Sujanpur, months after a similar act was carried out by suspected Pakistani terrorists before they attacked the air force base here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X