రైల్లో 35 లక్షల రద్దుచేసిన నగదు , ఆ నగదు ఎవరిది
బీహార్ :పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన తర్వాత వాటిని మార్పిడి చేసుకొనేందుకు నల్ల దనం ఉన్నవారు అనేక రకాల మార్గాలను వెతుకుతున్నారు. కొందరైతే ఈ నగదును ఏం చేయాలో తెలియక ఎక్కడో ఒక్క చోట వదిలేసి వెళ్తున్నారు.శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో రద్దుచేసిన నగదు నోట్లను వదిలివెళ్ళిన బ్యాగును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకొంది.
బీహార్ లోని గయానా లో ఓక రైలు బోగిలో రద్దు చేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నోట్ల కట్టలను భారీగా స్వాధీనం చేసుకొన్నారు రైల్వే పోలీసులు.వీటి విలువ సుమారు 35 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఈ నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ నగదును ఎవరు రైలు బోగీలో ఉంచారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు బోగీలో రద్దుచేసిన నగదు ఉన్న బ్యాగును వదిలేసి వెళ్ళారు.
తమ వద్ద మిగిలిన ఉన్న రద్దుచేసిన నగదును వదిలించుకొనేందుకు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు నగదును నదిలో పారేయగా, మరికొందరు రైలు బోగీల్లో వదిలేస్తున్నారు. తాజాగా బీహార్ లో చోటుచేసుకొన్న ఘటనలో ఈ నగదు ఎవరిదో అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన తర్వాత వాటిని మార్పిడి చేసుకొనేందుకు నల్ల దనం ఉన్నవారు అనేక రకాల మార్గాలను వెతుకుతున్నారు. కొందరైతే ఈ నగదును ఏం చేయాలో తెలియక ఎక్కడో ఒక్క చోట వదిలేసి వెళ్తున్నారు.శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో రద్దుచేసిన నగదు నోట్లను వదిలివెళ్ళిన బ్యాగును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకొంది.
రద్దు చేసిన పెద్ద నగదు నోట్లను రైలు బోగిలో వదిలి వెళ్ళిన ఘటన తాజాగా బీహార్ లోచోటుచేసుకొంది. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు బోగీలో రద్దుచేసిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదు ఉన్న బ్యాగును గయానా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బ్యాగు ఎవరిదో పోలీసులు ఆరా తీస్తున్నారు.