వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లల హత్య
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారు వారి వయస్సు నాలుగు నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. వారి శవాలు సోమవారంనాడు బయట పడ్డాయి.
పిల్లల కొంతు నులిమి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుటుంబంతో పాటు వారంతా మూడు రోజుల క్రితమే నగరంలోని సామర్ గార్డెన్లోని ఇంట్లో చేరినట్లు తెలుస్తోంది. వారి తండ్రి జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ మహిళ శవం పడి ఉందని, ఆమె వారి తల్లి కావచ్చునని పోలీసులు అంటున్నారు. ఆమె వయస్సు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఆమె శవం కనిపించింది.
ఆమె శవం ఓ పురుషుడి శవంతో పాటు కనిపించింది. వారిద్దరికి లైంగిక సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
English summary
The bodies of four children, aged between four and 15 years, were found in a house on the outskirts of Meerut in Uttar Pradesh on Monday.
Story first published: Monday, January 26, 2015, 15:32 [IST]