వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లల హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారు వారి వయస్సు నాలుగు నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుంది. వారి శవాలు సోమవారంనాడు బయట పడ్డాయి.

పిల్లల కొంతు నులిమి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుటుంబంతో పాటు వారంతా మూడు రోజుల క్రితమే నగరంలోని సామర్ గార్డెన్‌లోని ఇంట్లో చేరినట్లు తెలుస్తోంది. వారి తండ్రి జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

4 Children of a Family Found Dead, With Throats Slit, in a House in Meerut

కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ మహిళ శవం పడి ఉందని, ఆమె వారి తల్లి కావచ్చునని పోలీసులు అంటున్నారు. ఆమె వయస్సు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఆమె శవం కనిపించింది.

ఆమె శవం ఓ పురుషుడి శవంతో పాటు కనిపించింది. వారిద్దరికి లైంగిక సంబంధం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
The bodies of four children, aged between four and 15 years, were found in a house on the outskirts of Meerut in Uttar Pradesh on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X