బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో లేడీ టెక్కీ దుర్మరణం: తల నుజ్జునజ్జు, ఉద్యోగానికి వెళ్లి !
ఉద్యోగానికి వెలుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగింది.
బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగింది. బెంగళూరులో నివాసం ఉంటున్న కావ్యశ్రీ (23) అనే యువతి దుర్మరణం చెందింది.
టెక్కీ క్యాబ్ దిగింది, నడిరోడ్డులో యువతిని నలిపేశారు. ముద్దుల వర్షం, లిప్ లాక్, దర్జాగా !
ఎలక్ట్రానిక్ సిటీ లోని ఆక్సెస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో కావ్యశ్రీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ)గా ఉద్యోగం చేస్తున్నది. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే స్కూటర్ లో ఉద్యోగానికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని వీరసంద్ర గేట్ దగ్గర కావ్యశ్రీ వెలుతోంది.
ఆ సందర్బంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కావ్యశ్రీ స్కూటర్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన కావ్యశ్రీ తల మీద అదే లారీ చక్రాలు దూసుకెళ్లాయి. హెల్మెట్ పెట్టుకున్నా అది పగలి కావ్యశ్రీ తల నుజ్జునజ్జు అయ్యి సంఘటనా స్థలంలోనే ఆమె దుర్మరణం చెందింది.
పేరుకు మసాజ్: లోపల అంతా రంకు: అమ్మాయిలా, ఆంటీలా, క్రెడిట్ కార్డులు ఓకే !
గుజరాత్ కు చెందిన కావ్యశ్రీ బెంగళూరు చేరుకుని ఉద్యోగం చేస్తోందని పోలీసులు అన్నారు. ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ ను ఎలక్ట్రానిక్ సిటి ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కావ్యశ్రీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.