పాలు ఇమ్మంటే 21 ఏళ్ల పక్కింటి అమ్మాయిని పాడు చేశాడు: చివరికి కామాంధుడి కథ !
పాలు తీసుకురావడానికి పక్కింటికి వెళ్లిన యువతి మీద అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని కారవార సమీపంలోని హున్నావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హున్నావర్ లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి మీద అత్యాచారం జర
కారవార(బెంగళూరు): పాలు తీసుకురావడానికి పక్కింటికి వెళ్లిన యువతి మీద అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని కారవార సమీపంలోని హున్నావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హున్నావర్ లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతి మీద అత్యాచారం జరిగిందని పోలీసులు చెప్పారు.
కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !
21 ఏళ్ల యువతి ఇంటి సమీపంలో సుబ్రమణ్య రోబల్ శెట్టి (29) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల యువతి సుబ్రమణ్య రోబల్ శెట్టి ఇంటిలో పాలు తీసుకురావడానికి వెళ్లిందని సమాచారం. ఆ సందర్బంలో అతని ఇంటిలో ఎవ్వరూ లేరని తెలిసింది.
ఇంటికి వచ్చిన యువతి మీద సుబ్రమణ్య రోబల్ శెట్టి అత్యాచారం చేశాడని బాదితురాలి తల్లి హున్నావర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం యువతి మీద అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారని, అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో వెలుగు చూసిందని సుబ్రమణ్య రోబల్ శెట్టిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని హున్నావర్ పోలీసులు తెలిపారు.