‘ఈ బ్యాగ్ కోసం కలాం ఇక రారు’(ఫొటో)
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూసిన సమయలో ఆయనతోపాటు ఉన్న సహాయకుడు, ఐఐఎం(అహ్మదాబాద్) పూర్వ విద్యార్థి సృజన్ పాల్ సింగ్ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు. షిల్లాంగ్లో కలాం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సమయంలో కూడా సృజన్ పాల్ సింగ్.. ఆయనతోనే ఉన్నారు.
Dr. Kalam during his visit to our home in Lucknow ... he loved pakodas.... even today we had pakoda tea
Posted by Srijan Pal Singh on Monday, 27 July 2015
కలాంకు దేశమంతటా ఘనంగా నివాళులర్పిస్తుండగా తన ఫేస్బుక్ పేజీలో కలాంతో తన అనుభవాలను పంచుకున్నాడు సృజన్. కలాం ఉపయోగించే బ్యాగ్ ఫొటో ఒక దాన్ని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ప్రతీసారి కలాం తన కార్యక్రమాల ముగించుకున్న తర్వాత ఈ బ్యాగ్ వద్దకు వచ్చేవారని, అయితే ఇప్పుడు ఆ బ్యాగ్ కొరకు కలాం ఇక రారు అంటూ కామెంట్ రాశారు. లక్నోలో తన ఇంటిని కలాం సందర్శించినప్పటి ఫొటో కూడా పోస్ట్ చేశాడు.
పకోడి అంటే కలాంకు ఎంతో ఇష్టమని, అతని చివరి రోజు కూడా పకోడి, టీ తీసుకున్నారని సృజన్ పాల్ సింగ్ రాశాడు. పాల్ పోస్ట్ చేసిన ఈ రెండు పోస్టులకు ప్రజల నుంచి విపరీత స్పందన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు తమ స్ఫూర్తి ప్రదాతకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.