ట్రయాంగిల్ లవ్: భర్తను వదిలి ప్రియుడితో వెళ్ళింది, భర్త ఏం చేశాడంటే?
వారిద్దరూ ప్రేమించుకొని పెళ్ళిచేసుకొన్నారు. వారిద్దరికి నాలుగేళ్ళ పాప కూడ ఉంది.అయితే వారి జీవితంలో ఓ వ్యక్తి చిచ్చురేపాడు. వివాహేతర సంబంధం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తాను వెళ్ళిపోతున్నానని చె
బెంగుళూరు:వారిద్దరూ ప్రేమించుకొని పెళ్ళిచేసుకొన్నారు. వారిద్దరికి నాలుగేళ్ళ పాప కూడ ఉంది.అయితే వారి జీవితంలో ఓ వ్యక్తి చిచ్చురేపాడు. వివాహేతర సంబంధం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తాను వెళ్ళిపోతున్నానని చెప్పి ఓ లెటర్ ను రాసి వెళ్ళిపోయింది వివాహిత.అయితే తన భార్య కోసం భర్త ఆమె ఫోటో పట్టుకొని మరీ గాలిస్తున్నాడు.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని నెలమంగళ తాలుకా దాబస్ పేట టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకొంది. మాండ్యాకు చెందిన శ్రీనివాస్ చెన్నరాయపట్టణానికి చెందిన జ్యోతి లు ప్రేమించుకొన్నారు. వీరిద్దరూ బెంగుళూరులోని పీణ్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది.
కొంతకాలంపాటు ప్రేమించుకొని ఐదేళ్ల క్రితం పెళ్ళిచేసుకొన్నారు. దాబస్ పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ళ పాప కూడ ఉంది. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో చెన్నరాయపట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ప్రవేశించాడు.
జ్యోతిని పాతపరిచయం పేరరుతో ముగ్గులోకి లాగాడు. వారం రోజుల క్రితం జ్యోతి నగలు, నగదు, సరుకులతో పాటు తన పాపను కలిసి ఇల్లు వదిలివెళ్ళిపోయింది. మిమ్మల్ని వదిలిపోతున్నా, సారీ, ఏడవకండి అంటూ చిన్న లెటర్ రాసి వెళ్ళింది.ఆ రోజు నుండి శ్రీనివాస్ ఇల్లు, పని వదిలేసి భార్య, పాప ఫోటోలు పట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు. తప్పును క్షమిస్తాను , ఇంటికి రావాలని ఆయన కోరుతున్నాడు.