ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందిలా..ఎందుకంటే?
ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.
చెన్నై:ప్రియుడి మోజులో పడి వివాహిత కట్టుకొన్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కొనసాగించకూడదని హెచ్చరించినందుకే భర్తను హత్య చేసింది భార్య.
తమిళనాడు రాష్ట్రంలోలి శ్రీవిల్లిపుత్తూరు కొటైటపట్టికి చెందిన పొన్ రాజ్ కు తో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకొన్న రాజేశ్వరి భర్త ఈశ్వరన్ ఈ విషయమై ఇద్దరిని మందలించాడు.
ఈశ్వరన్ కూలీ పనిచేస్తుంటాడు. రాజేశ్వరి కూరగాయల దుకాణం నడిపేది.వీరికి ఇద్దరు కొడుకులు కూడ ఉన్నారు.పొన్ రాజ్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కారణమైంది.
ఈ మేరకు ఈశ్వరన్ తాను పనిచేసే ప్రాంతంలోనే మద్యం మత్తులో పడుకొని ఉండగా రాజేశ్వరి, పొన్ రాజ్ లు వేటకత్తితో నరికి హత్య చేశారు. దీనిపై శ్రీవిల్లిపుత్తూరు టౌన్ సిఐ మహేష్ కుమార్ దర్యాప్తు చేశారు.
ఈ దర్యాప్తులో ఈశ్వరన్ ను పొన్ రాజ్, ఈశ్వరన్ భార్య హత్య చేశారని తేలింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.