వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదిలే రైలు నుంచి మహిళను తోసేసిన రైల్వే అధికారి

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కదిలే రైలు నుంచి ఓ మహిళను రైల్వే అధికారి తోసేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన వందన అనే మహిళ కుటుంబసభ్యులతో కలిసి హౌరా-ముంబై రైలులో ప్రయాణిస్తోంది. అయితే వారు జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో కూర్చున్నారు.

A woman passenger throws out of moving train

కాగా, అక్కడికి వచ్చిన రైల్వే అధికారి వారిని అదనంగా డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో వందన ఆ రైల్వే అధికారితో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహానికి గురైన సదరు అధికారి ఆమెను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
A woman passenger has been thrown out of a moving train in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X