ప్రధానిపై వాట్సాప్ లో పోస్టు పెట్టాడు.. ఉద్యోగం పోగోట్టుకొన్నాడు
వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై అభ్యంతరకరమైన పోస్టులను పెట్టిన పంచాయితీరాజ్ శాఖాధికారి ఉద్యోగం పోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.
న్యూడిల్లీ : వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అభ్యంతకరమైన పోస్టులను పెట్టిన పంచాయితీరాజ్ అధికారి ఉద్యోగానికి ఎసరుపెట్టాయి. ఆయనతో పాటు మరోకరిపై కూడ కేసులు నమోదు చేశారు పోలీసులు.
వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉత్తర్ ప్రదేశ్ కుచెందిన పంచాయితీరాజ్ శాఖ అధికారి అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను వాట్సాప్ గ్రూప్ పోస్టు చేశాడు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సారథ్యంలో నడుస్తున్న వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశారు.
ఆయనపై పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తోన్న ఆయనకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుండి తప్పించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ వాట్సాప్ గ్రూప్ లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టినందుకు ఆయనను సస్పెండ్ చేశారు.
మరో వైపు ఇదే ఫోటో ను వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తోన్న ఓ కాలేజీ మేనేజర్ హరిఓం సింగ్ పై బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫరీద్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.