వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ రావాలని విపక్షాల ఆందోళన: ఉభయసభల్లో గందరగోళం
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళవారం కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళవారం కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధాని మోడీ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. బిజెపి పార్లమెంటరీ సమావేశం కొనసాగుతున్నందున ప్రధాని ఇప్పుడు రాలేదని, చర్చ ప్రారంభిస్తే ప్రధాని మధ్యలో హాజరవుతారని తెలిపారు.
అయితే, ఆయన మాటను వినకుండా విపక్షాలు వినకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు.
Comments
demonetisation narendra modi parliament debate new delhi currency పెద్ద నోట్లు రద్దు నరేంద్ర మోడీ పార్లమెంట్ చర్చ న్యూఢిల్లీ కరెన్సీ
English summary
Demonetisation has been the reason for Parliament washouts over ten days now since Winter Session began on 16 November. Interestingly, Parliament has not discussed anything else except note ban imposed by the Narendra Modi government since the Winter Session began.
Story first published: Tuesday, November 29, 2016, 12:35 [IST]