వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కూల్చివేత: నేరం రుజువైతే అద్వానీకి 5ఏళ్ల జైలు తప్పదు..

అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కుట్ర కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి పునర్విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ అభియోగాలు గనుక రుజువైతే ఒక్కొక్కరు రెండు నుంచి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.

భారత శిక్షా స్మృతి ప్రకారం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రసంగాలు ఇవ్వడం తదితర నేరాల కింద గరిష్టంగా వీరికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advani stares at a 5 year jail term if convicted in Babri Masjid case

కాగా, సుప్రీం తీర్పుపై స్పందించిన ఉమాభారతి నేరం రుజువైతే ఉరిశిక్షకైనా సిద్దమైనేనని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బుధవారం నాడు కొనసాగాల్సిన తన అయోధ్య పర్యటన కొనసాగుతుందని చెప్పినప్పటికీ.. బీజేపీ చీఫ్ అమిత్‌షాతో సమావేశం అనంతరం ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమిత్ షా సూచన మేరకే ఆమె తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

English summary
BJP stalwarts, L K Advani, Murli Manohar Joshi and Uma Bharti stare at a 5 years jail term if convicted in the Babri Masjid demolition case. The charges against them suggest that if convicted by the trial court, they could be imprisoned to a jail term ranging between 2 and 5 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X