జియోకు ఝలక్ ఇచ్చిన ఎయిర్ టెల్, బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు 1000 జీబీ బోనస్ డేటా
త్వరలోనే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ జియో ప్రణాళికలు రచిస్తుండగా..
న్యూఢిల్లీ: త్వరలోనే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ జియో ప్రణాళికలు రచిస్తుండగా.. దానికంటే ముందుగా ఎయిర్టెల్ కూడా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.
జియో ఫోన్ ఎఫెక్ట్: ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ!
తాజాగా తన వినియోగదారుల కోసం ఎయిర్టెల్ కొత్త బోనస్ డేటా ఆఫర్ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు 1000 జీబీ వరకు అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొంది. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయయి.
దీని కింద నెలకు 60 జీబీ డేటాను, అదనంగా ఏడాదిలో 50 0జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ప్రకారం ఈ ప్లాన్ స్పీడు 40 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.
మరో ప్లాన్ రూ.1099 కింద అదే 40 ఎంబీపీఎస్ స్పీడులో నెలకు 100 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నామని, అంతేకాక 1000 జీబీ బోనస్ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది.
మీరు ఎయిర్ టెల్ కస్టమరా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీకే!
ఇలా రూ.1299, రూ.1499, రూ.1799 ప్లాన్లకు కూడా 1000 జీబీ వరకు బోనస్ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా తన ఫైబర్ నెట్వర్క్ను లాంచ్ చేయడానికి టెస్టింగ్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్ చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇప్పటికే జియో ఎంట్రీతో తీవ్ర కుదుపులోకి లోనైన టెలికాం దిగ్గజాలు, బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో జియోకు కౌంటర్ ఇచ్చేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నాయి. వీటిని జియో ఎలాంటి ప్లాన్లతో ఎదుర్కొంటుందో మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.