రెండు రోజుల్లో అఖిలేష్ ప్రభుత్వం కూలిపోతోంది.మాయావతి జోస్యం.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండు రోజుల్లో కుప్పకూలనుందని జోస్యం చెప్పారు మాజీ సిఎం, బిఎస్ పి అధ్యక్షురాలు మాయావతి.యూపి రాష్ట్రాన్ని సమాజ్ వాదీ పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టించిందని ఆమె ఆరోపించారు.
సమాజ్ వాదీ పార్టీ నుండి బహిష్కరణకు గురైన రామ్ గోపాల్ యాదవ్ బిజెపిలో చేరుతారనే వార్తలను యూపి రాష్ట్ర బిజెపి నాయకులు కొట్టిపారేశారు.ఇప్పటివరకు తమకు ఈ సమాచారమే లేదన్నారు.ఒక వైపు, మరో వైపు ములాయం వర్గంగా పార్టీ చీలిపోయిందని విపక్షాలు విమర్శటు చేస్తున్నాయి. పార్టీ, కుుటుంబ సమస్యల్లో పడి పాలనను అఖిలేష్ మరిచారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ విషయమై ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.
పార్టీలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని విపక్షాలు అఖిలేష్ ను డిమాండ్ చేస్తున్నాయి.సంక్షోభం లోకూరుకుపోయిన అఖిలేష్ ప్రభుత్వం రెండు రోజుల్లో కుప్పకూలనుందని మాయవతి ఆరోపించారు.