జయ ఆరోగ్యంపై అపోలో తాజా ట్వీట్లు: 11గం.కు ఎమ్మెల్యేలందరూ ఆస్పత్రికి
రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ సోమవారం ఉదయం 11గంటల వరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశించింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒక విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. జయ ఆరోగ్యంపై తమిళనాడు కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
కాగా, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ సోమవారం ఉదయం 11గంటల వరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అందరు మంత్రులూ ఆస్పత్రి వద్దే ఉన్నారు.
అపోలో ఆస్పత్రి తాజా ట్వీట్లు
Our doctors are closely monitoring Hon'ble CM's condition and they are trying their very best. #GodblessAmma @HospitalsApollo
— Sangita Reddy (@SangitaApollo) December 4, 2016
Our doctors are closely monitoring Hon'ble CM's condition and they are trying their very best. #GodblessAmma @HospitalsApollo
— Sangita Reddy (@SangitaApollo) December 4, 2016
జయలలిత గొప్ప నాయకురాలని అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ సంగీతా రెడ్డి ట్వీట్టర్ వేదిక వ్యాఖ్యానించారు. అపోలో వైద్యులు జయలలితకు వైద్యం అందిస్తున్నారని, వారి ఉత్తమ ప్రయత్నంతో త్వరలోనే జయలలిత కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
8మంది వైద్యులు
జయలలిత ఆరోగ్యం విషమంగా ఉండటంతో 8మంది అపోలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లండన్ డాక్టర్ రిచర్డ్ బేలీని కూడా వారు సంప్రదించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
పోలీసులకు సెలవు లేదు
తమిళనాడులోని పోలీసులకు ఇవాళ్టి నుంచి ఎలాంటి సెలవులు ఉండవని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. మండల స్థాయి నుంచీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సూచించారు.