సియాచిన్ వద్ద పాకిస్థాన్ యుద్ధవిమానం చక్కర్లు: యుద్ధానికి సిద్దమా !
భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గ్లేషియర్ సమీపంలో బుధవారం ఆదేశ యుద్దవిమానాలు చక్కర్లు కొట్టినట్లు సమాచారం వచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ శిభిరాలపై భారత్ సైన్యం దాడులు జరిపిందని ఆర్మీ ప్రకటించిన.
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గ్లేషియర్ సమీపంలో బుధవారం ఆదేశ యుద్దవిమానాలు చక్కర్లు కొట్టినట్లు సమాచారం వచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ శిభిరాలపై భారత్ సైన్యం దాడులు జరిపిందని ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే పాకిస్థాన్ మరోసారి దూకుడు చర్యకు పాల్పడింది.
సియాచిన్ ప్రాంతంలోని పాక్ కు చెందిన అన్ని ఆర్మీ బేస్ లను నిర్వహణలోకి తీసుకు వచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో సియాచిన్ వద్ద ఆర్మీ బేస్ లను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ పర్యవేక్షించారని పాక్ మీడియా పేర్కొంది.
సియాచిన్ వద్దర పాక్ యుద్ధవిమానం అతి తక్కువ ఎత్తులో సంచరించిందని ఆదేశానికి చెందిన మీడియా వార్తలు ప్రసారం చేసింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. సియాచిన్ వద్ద భారత భూభాగంలో పాక్ కు చెందిన ఎలాంటి యుద్ధవిమానాలు సంచరించలేదని భారత్ తేల్చి చెప్పింది. మొత్తం మీద పాక్ తనంతకు తానే కోరి కష్టాలు కొని తెచ్చుకోవడానికి సిద్దం అవుతోంది.