ఒబామా దంపతులు బస... మూడు రోజలు ఆ హోటల్లోనే (ఫోటో)
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ద బీస్ట్ వాహనంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. 2010లో ఆయన భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్లో బస చేశారు. ఈ సారి మాత్రం ఆయన కోసం ప్రత్యేకంగా 29 సూట్లు సహా 440 గదుల్నీ ఆయన బృందం కోసం బుక్ చేశారు.
ఇక ఐటీసీ మౌర్య హోటల్కు ఉన్న ప్రత్యేకలకను చూద్దాం. 1977లో నిర్మించిన ఈ హోటల్లో ప్రపంచంలోనే అత్యంత వీఐపీల బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వచ్చిన అతిధికి అందించే ఆహారాన్ని ముందుగా పరీక్షించడం కోసం మౌర్య హోటల్లో అత్యంత మైక్రోబయాలజీ ప్రయోగశాల కూడా ఉంది.
ఇక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస చేసే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బుల్లెట్ ఫ్రూప్, ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం, వేగంగా ప్రయాణించే ప్రత్యేక లిఫ్ట్, ముఖ్యమైన రహస్యాలు జరపడానికి ప్రత్యేక కార్యాలయం, వ్యాయామశాల, రెండు పడకగదులు దీని ప్రత్యేకం.
వీటితో పాటు 12 మందికి ఆతిథ్యం ఇవ్వగల డైనింగ్ హాల్ దీని సొంతం. భారత్ పర్యటలో ఒబామా దంపతులు తమ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడే బస చేస్తారు.