అందుకోసమేనట!: డబుల్ హ్యాపీ అనుష్కతో కోహ్లీకి కిక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ భామ అనుష్క శర్మకు డబుల్ హ్యాపీ! ప్రస్తుతం పీకే సినిమా విజయంతో ఆమె సంతోషంతో ఉన్నారు. అదే సమయంలో బీసీసీఐ కూడా తన బాయ్ ఫ్రెండ్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో ఆమె ఎగిరి గంతేస్తున్నారంటున్నారు.
అనుష్క శర్మ పీకే విజయంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరోవైపు, తొలి టెస్టులో రెండు వరుస ఇన్నింగ్సులలో సెంచరీలు చేశాడు. రెండో టెస్టులో మాత్రం ఆశించిన మేరకు ఆడలేకపోయాడు. దీనికి తోడు శిఖర్ ధావన్తో డ్రెస్సింగ్ రూంలో గొడవ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో, కోహ్లీ కొంత అప్సెట్ అయి ఉంటారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియురాళ్లను కూడా బీసీసీఐ అనుమతించడం ద్వారా అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు వెళ్తోంది. ఇది కోహ్లీకి ఉత్సాహాన్నిచ్చేదేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పీకే సినిమా విజయోత్సవాన్ని, తన బాయ్ ఫ్రెండ్ అప్ సెట్ తొలగించేందుకు, కొత్త ఏడాది వేడుకలు కలిసి జరుపుకునేందుకు అనుష్క శర్మ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్తోందని అంటున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలను కోహ్లీతో జరుపుకోవాలని నిశ్చయించుకుందంటున్నారు.
కాగా, ఇటీవల ఓ మేగజైన్కు అనుష్క శర్మ హాట్ ఫోజోలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని పైన విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మను పోన్లో నిలదీసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీని పైన విరాట్ కోహ్లీ శాంతించడంతో కూడా అనుష్క ఆసీస్ పర్యటనకు వెళ్తోందంటున్నారు.