ముంబైకి అర్పితా ఖాన్, ఆయుష్: గ్రాండ్గా రిసెప్షన్
ముంబై: చారిత్రకనగరం హైదరాబాదులోని చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, వ్యాపారవేత్త ఆయూష్ శర్మ ముంబైలో వివాహానంత విందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి వివాహానంతర విందుకు హేమాహేమీలు హాజరవుతారని భావిస్తు్నారు.
వివాహానంతర విందులో ముగ్గురు ఖాన్లు షారూక్, అమీర్, సల్మాన్ ఒక చోట కనిపిస్తారని భావిస్తున్నారు. రిసెప్షన్కు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా వస్తారని ఆశిస్తున్నారు. తన సోదరి అర్పితా వివాహానికి సల్మాన్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. అయితే, వివాహం సమయంలో మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు.
ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో అర్పితా ఖాన్, ఆయూష్ శర్మల వివాహానంత విందుకు ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ శైలిలో ఈ విందు ఉంటుందని భావిస్తున్నారు. అర్పితా ఖాన్ తన వివాహం సందర్భంగా చేయాలనుకున్న ప్రసంగాన్ని రాతపూర్వకంగా పెట్టుకున్నారు. అయితే, తీరా దాన్ని చదవాల్సి వచ్చేసరికి ఆమెకు నోట మాట రాలేదు.
ఖాన్స్ వంటి కుటుంబంలోకి తాను రావడం ఎంతో అదృష్టమని అర్పితా ఖాన్ ప్రసంగంలో అభిప్రాయపడిందట. కుటుంబం శక్తికి తన సోదరులు స్తంభాలని ఆమె అన్నది.. సొహైల్, అర్బాజ్, సల్మాన్లకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పింది. సలీం ఖాన్, సల్మా, హెలెన్ తన తల్లిదండ్రులు కావడం తాను చేసుకున్న అదృష్టమని చెప్పింది. అర్పిత ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆయుష్ శర్మను ఈ నెల 18వ తేదీన హైదరాబాదులోని ఫలక్నుమా ప్యాలెస్లో వివాహం చేసుకుంది.