పెట్రోల్ బాంబులు సీజ్: మంగళూరులో అలర్ట్
బెంగళూరు: అరాచకాలు స్పృష్టించడానికి పెట్రోల్ బాంబులు తయారు చేశారు. విషయం పసిగట్టిన మంగళూరు బజ్పే పోలీసులు బాంబులు స్వాదీనం చేసుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు నగరంలోని బజ్పే విమానాశ్రయం సమీపంలోని టెలిఫోన్ ఎక్సైంజ్ కార్యాలయం దగ్గర బాంబులు సీజ్ చేశామని మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ చెప్పారు.
మంగళూరు నగర శివార్లలోని గంజిమఠ ప్రాంతంలోని ఇంటిలో పెట్రోల్ బాంబులు నిల్వ చేశారని ఒక అజ్ఞాత వ్యక్తి బజ్పే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఇంటి మీద దాడి చేశారు.
ఇంటిలో నిల్వ చేసిన 8 పెట్రోల్ బాంబులు, మూడు తల్వార్ లు స్వాదీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురుగన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెట్రోల్ బాంబులు ఎవరు నిల్వ చేశారు అని ఆరా తీస్తున్నారు.
దక్షిణ కన్నడ జిల్లాలో రెండు వర్గాల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పర్యటించే సమయంలో మంగళూరులో గొడవలు స్పృష్టించాలని పథకం వేసి ఉంటారని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ముందు జాగ్రత చర్యగా బజ్పే విమానాశ్రయం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బాంబులు ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్న వారు ఎవరనే విషయంపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.