అత్యాచారం: బ్యాడ్ అంకుల్ గురించి చెప్పిన బాలిక
మధ్యాహ్న భోజనం తర్వాత కాస్తా కూనుకు తీసి తల్లి బిడ్డ పక్కన కూర్చుని సున్నితంగా ఏం జరిగిందని ప్రశ్నించింది. తనను కొట్టి దుర్మార్గుడైన అంకుల్ గురించి చెప్పింది. శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా గాయాలు కనిపించాయి. గురువారంనాడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమావేశం జరిగింది.
బాలికను రోజంతా అబ్జర్వేషన్లో పెట్టామని టీచర్ చెప్పాడు. పదే పదే అదే మాట చెప్పింది. అమ్మాయి రెండు సార్లు బయటకు వెళ్లిందని, రెండు సార్లు కూడా మహిళా కేర్ టేకర్ వెంట వెళ్లిందని చెప్పింది. అదంతా సిసిటీవీలో రికార్డయిందని కూడా వాదించింది.
దీపావళి వేడకలు జరుగుతుండగా అమ్మాయి ఎటు వెళ్లిందని తల్లిదండ్రులు అడిగారు. అయితే, దానికి పాఠశాల యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు. తరగతి గదిలో గానీ ఆట స్థలంలో గానీ విద్యార్థులు ఉన్నారా, లేదా అనేది కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ అమ్మాయిపై అత్యాచారం జరిగిందనే అనుమానాలకు తావు ఇస్తోంది. తల్లిదండ్రులు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసినప్పుడు లైంగిక దాడి జరిగిందనే విషయం తేలింది.