బీఫ్ తిన్నందుకే బోల్ట్కు గోల్డ్ మెడల్స్: ట్విట్టర్లో ఎంపీ వివరణ
న్యూఢిల్లీ: బీఫ్ తిన్నందుకే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్లో 9 బంగారు పతకాలను గెలిచాడని ఆదివారం బీజేపీకి చెందిన ఎంపీ ఉదిత్ రాజ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయన తిరిగి సోమవారం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు.
ఒలింపిక్స్లో మెడల్ గెలవడానికి ఉన్న మార్గాలు అన్వేషించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... చిన్నప్పటి నుంచి పేదరికం, సరైన వసతులు లేకపోయినా బోల్ట్ వాటిని అధిగమించి ఒలింపిక్స్లో 9 బంగారు పతకాలు సాధించాడని ట్వీట్ చేశారు.
బోల్ట్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని ట్రైనర్ సైతం రెండుపూటలా బీఫ్ తినమని చెప్పినందుకే ఇది సాధ్యమైందని మొదట ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆయన వెంటనే మరో ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు బీఫ్ తినడాన్ని ప్రోత్సహించినట్లు ఉన్నాయన్న వాదన 200 శాతం తప్పని అన్నారు.
ప్రస్తుతం మన దేశంలో గోవధపై ఉన్న సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీఫ్ తిన్నంత మాత్రాన పతకాలు రావని, సరైన వసతులు కల్పిస్తేనే పతకాలు సాధ్యమవుతాని నెటిజన్లు ట్విట్టర్లో ఎంపీలకు సలహా ఇచ్చారు.
My tweet is not even remotely connected to advocate beef eating rather it is reproduction of Bolt trainer statement
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016
As usain bolt &trainer found ways and means to win medals similarly our players and trainers should do as per their circumstances
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016
I intended to convey-players & society to look at ways to win in games rather blaming circumstances & Govt & eating is their choice
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016
I cited circumstances ofJamaica that despite poor infrastructure & poverty Bolt won 9 gold so our players should find ways like that to win
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016