రాష్ట్రపతి కాన్వాయ్ ను నిలిపివేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్, ఎందుకంటే?
అంబులెన్స్ కు దారిచ్చేందకుగాను ఏకంగా రాష్ట్రపతి కాన్వాయ్ కు బ్రేకులు వేసిన ఓ ట్రాపిక్ పోలీసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
బెంగుళూరు:అంబులెన్స్ కు దారిచ్చేందకుగాను ఏకంగా రాష్ట్రపతి కాన్వాయ్ కు బ్రేకులు వేసిన ఓ ట్రాపిక్ పోలీసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం నాడు మెట్రో గ్రీన్ లేన్ ను ప్రారంభించిందుకు బెంగుళూర్ కు వచ్చారు.రాజ్ భవన్ వైపు వెళ్తున్న ఆయన కాన్వయ్ రద్దీగా ఉండే ట్రినిటీ సర్కిల్ వద్దకు చేరుకోగానే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎంఎల్ నిజలింగప్ప ప్రణబ్ కాన్వాయ్ ను నిలిపివేశాడు.
ఈ విషయం తెలుసుకొన్న ఈస్ట్ డివిజన్ ట్రాఫిక్ డిసిపీ అభయ్ గోయల్ నిజలింగప్పపై ప్రశంసలు కురిపించాడు. భారత తొలిపౌరుడి కంటే ముందుగా అంబులెన్స్ కు దారిచ్చినందుకు నిజలింగను ప్రశంసించారు.
బెంగుళూర్ ట్రాఫిక్ పోలీసులు దారిచ్చినట్టుగానే మీరిస్తారా? అంటూ పోస్టు చేశారు. దీనిపై బెంగుళూరు సీపీ ప్రవీణ్ సూద్ కూడ వెల్ డన్ అంటూ స్పందించారు. తర్వాత కొద్దిక్షణాల్లోనే ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బెంగుళూరు ట్రాపిక్ పోలీసులను ప్రసంశలతో ముంచెత్తారు.