శుభవార్త: బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగాలకు వేతనాల పెంపు?
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలో పనిచేసే వారికి ఈ ఏడాది అంతా మంచే జరగనుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా వేతనాలు పెరిగే అవకాశాలున్నాయని టీమ్ -లీజ్ జాబ్స్ శాలరీస్ ప్రీమియర్ -2017 సంస్థ తెలిప
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలో పనిచేసే వారికి ఈ ఏడాది అంతా మంచే జరగనుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా వేతనాలు పెరిగే అవకాశాలున్నాయని టీమ్ -లీజ్ జాబ్స్ శాలరీస్ ప్రీమియర్ -2017 సంస్థ తెలిపింది.
గత నాలుగేళ్ళుగా వేతనాల ఇంక్రిమెంట్లలో టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ రంగం తర్వాత ఈ ఏడాది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి ఎక్కువ వేతన ఇంక్రిమెంట్ ఉండబోతున్నట్టు పేర్కొంది. ఎన్నడూ లేనంతంగా సగటున 17.2 శాతం వేతన ఇంక్రిమెంట్లు ఉంటాయని ఆ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది.
విద్యా, ఈ కామర్స్ రంగాల్లో వందకు పైగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందని వెల్లడించింది. అదే విధంగా ఇళ్ళ నిర్మాణం, రియల్ ఏస్టేట్, ఆటోమొబైల్ , పారిశ్రామిక తయారీ దాని అనుబంధ పరిశ్రమల్లో ఇంక్రిమెంట్లు తగ్గిపోనున్నాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ రంగాలను భారీగా దెబ్బకొట్టింది. ఇతర రంగాలు ఎప్ఎమ్ సీజీ , రిటైల్ ర్యాలీ నిర్వహిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. తక్కువ సప్లై , ఎక్కువ డిమాండ్ కారణంగా బ్లూ కలర్ జాబ్స్ కు కొన్నేళ్ళుగా డిమాండ్ భారీగానే ఉంది.
శారీరక శక్తి , వ్యాయామం, బేసిక్ రీడింగ్, రాత , మౌఖిక కమ్యూనికేష్, వ్యక్తిగత నేర్పు వంటి స్కిల్స్ ఉన్నవారికే డిమాండ్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.
శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాల మధ్య ఏ మేరకు తేడా ఉంటుందనేది కూడ వెల్లడించింది. ఆరు నగరాల్లో ఏడు రంగాలపై జరిపిన సర్వేలో తాత్కాలిక , శాశ్వత ఉద్యోగాల మధ్య తేడా స్వల్పంగానే ఉన్నట్టు తెల్పింది.
ఈ విషయంలో చంఢీఘర్ (0.92 శాతం-2.8 శాతం),కోల్ కత్తా(1% -3.14%), అహ్మాదాబాద్ (1.08% -2.73%) టాప్ లో ఉన్నట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. ఐటీ, తయారీ , టెలికమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐలు టాప్ లో ఉన్నాయని ఆ సంస్థ తన రిపోర్ట్ లో వెల్లడించింది.