బీజేపీలో చేరిన ‘రేసు గుర్రం’ విలన్
ప్రముఖ భోజ్పురి నటుడు రవి కిషన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ.
న్యూడిల్లీ: ప్రముఖ భోజ్పురి నటుడు రవి కిషన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
కాగా, రవికిషన్ రాజకీయ పార్టీలో చేరడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఆయన కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. రవికిషన్ పలు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో 'రేసు గుర్రం', 'కిక్ 2', 'సుప్రీమ్' తదితర తెలుగు చిత్రాల్లో ఆయన ముఖ్యపాత్రలు పోషించారు.
మాయావతిపై మోడీ విసుర్లు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని ఒరైలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
आज प्रसिद्ध भोजपुरी अभिनेता@ravikishann जी @BJP4India Join करेंगे, राष्ट्रीय अध्यक्ष @AmitShah जी के समक्ष 10 am at 11 Ashok Rd, Delhi pic.twitter.com/plCcATPDGN
— Manoj Tiwari (@ManojTiwariMP) February 19, 2017
'నోట్లరద్దుతో చాలా ఇబ్బందులు పడ్డామని సోదరి(మాయావతి) అంటున్నారు.. ఆమెకు సరిపడా సమయం రాలేదని బాధపడుతన్నట్లు ఉన్నారు.. ఇప్పుడు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీకాదు.. బెహన్జీ కా సంపత్తి పార్టీగా మారిపోయింది' అని ఎద్దేవా చేశారు.
BJP promises that Bundelkhand's voice will be heard when the Government is formed in UP: PM Modi pic.twitter.com/hqAWmp3ywX
— ANI UP (@ANINewsUP) February 20, 2017
ఉత్తరప్రదేశ్లో అత్యంత అద్వానంగా ఉన్న ప్రాంతం ఏదైనా అయితే బుందేల్ఖండే అని అయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బుందేల్ఖండ్ సమస్యలను పట్టించుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.