మార్కెట్లోకి 'మోడీ మ్యాంగో' తెచ్చిన ముస్లీం వ్యాపారి, భలే గిరాకీ
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ హవా మామిడి పండ్ల మీద కూడా పడింది. ఉత్తర ప్రదేశ్లో ఇప్పుడు మోడీ మ్యాంగోకు భలే డిమాండ్ ఉంది. సరైన సమయం చిక్కినప్పుడు ఈ మోడీ మ్యాంగో పండ్లు భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా అందిస్తానని ప్రముఖ పండ్ల వ్యాపారి, వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ హాజీ కలీముల్లా అంటున్నారు.
వ్యవసాయ రంగంలో ప్రయోగాలు చేసి సరికొత్త మామిడి పండ్లు పండించండంలో హాజి కలీముల్లా నిపుణురు. సరి కొత్త మామిడి పండ్లు పండించినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఆయన తియ్యటి విభిన్న మామిడి పండ్లను పండించారు.
వాటికి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. మోడీ మ్యాంగో అని పేరు పెట్టి మార్కెట్లోకి పంపించాడు. ఈ పండ్లు రుచిగా ఉండటంతో అమ్మకాలు జోరందుకున్నాయని హాజీ కలీముల్లా అంటున్నారు. తాను ఇక మీద కొత్తగా పండించే మామిడి పండ్లకు సెలబ్రటిల పేర్లు పెడుతానని చెప్పారు.
మోడీ మ్యాంగోను ప్రధాని మోడీకి అందిస్తానని, రుచి చూసి ఆయన కచ్చితంగా తనను అభినందిస్తారనే నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మార్కెట్లో మోడీ మ్యాంగోకు మంచి డిమాండ్ ఉందని, ఈ పండ్లను కచ్చితంగా అందరూ ఇష్టపడుతారన్నారు.