తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోం ,అదనపు బలగాలను తరలిస్తాం
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే అదనపు బలగాలను తరలించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు. అయిత
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకొంటే వెంటనే స్పందిస్తామని ఆయన చెప్పారు. తమిళనాడు రాష్ట్రం ఎన్ని బలగాలను కోరితే అన్ని బలగాలను పంపుతామని ఆయన ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలో అవసరమైన కేంద్ర బలగాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తమిళనాడు రాష్ట్రం తమను అదనపు బలగాల కోసం కోరలేదని ఆయన చెప్పారు. తమిళనాడు రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని కేంద్రమంత్రి రిజిజు చెప్పారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు రాష్ట్రాలకు బలగాలను పంపడం కేంద్రం ప్రథమ కర్తవ్యమన్నారు. తమిళనాడు ఎప్పుడు కోరితే అప్పుడు బలగాలను పంపించేందుకు సిద్దమని ఆయన ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.