ఢిల్లీలో దట్టమైన పొగమంచు... శాలువాతో నేతలు (ఫోటోలు)
న్యూఢిల్లీ: గత ఐదేళ్ల కాలంలో లేనంతగా ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఢిల్లీలో జనజీవనం స్ధంభించింది. దేశ వ్యాప్తంగా 50 వరకు రైళ్లు, 16 విమానాలకు అంతరాయం కలిగింది. పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఢిల్లీలో పొగ మంచు 4.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై కూడా పడింది. ఉదయం నుంచీ పార్లమెంట్ పరిసరాల్లో పొగమంచు దట్టంగా అలముకుంది. కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు శాలువాలు కప్పుకుని పార్లమెంట్కు రావడం కనిపించింది.
ఢిల్లీలో పొగమంచు కారణంగా 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. పొగమంచు కారణంగా ఏపీ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడుస్తుంది. ఉదయం 6.25 గంటలకు బయల్దేరాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరును.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
గత ఐదేళ్ల కాలంలో లేనంతగా ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఢిల్లీలో జనజీవనం స్ధంభించింది.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
దేశ వ్యాప్తంగా 50 వరకు రైళ్లు, 16 విమానాలకు అంతరాయం కలిగింది. పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
ఢిల్లీలో పొగ మంచు 4.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై కూడా పడింది.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
జనవరి 26న జరిగే రిపబ్లిక్ పరేడ్ ఉత్సవాల కోసం ఉదయం పూట పొగ మంచులో రిహార్సల్స్ చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
ఉదయం నుంచీ పార్లమెంట్ పరిసరాల్లో పొగమంచు దట్టంగా అలముకుంది. కేంద్రమంత్రు హోం మంత్రి రాజ్నాధ్ సింగ్ శాలువాలు కప్పుకుని పార్లమెంట్కు వస్తున్న దృశ్యం.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో శాలువాలతో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, ఆ ప్రక్కనే జెడీఎస్ ఛీప్ హెచ్డి దేవ్ గౌడ.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో శాలువాతో జెడీఎస్ ఛీప్ హెచ్డి దేవ్ గౌడ.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం చలి మంట కాచుకుంటున్న ప్రజలు.