వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండుసార్లూ ఆశ్చర్యమే: మిస్త్రీకి ఉద్వాసన, టాటా తాత్కాలిక చైర్మన్గా రతన్
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. నాలుగు నెలల పాటు రతన్ టాటా తాత్కాలిక చైర్మన్గా ఉంటారు. కొత్త చైర్మన్ను నియమించే విషయమై ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ కొత్త చైర్మన్ను ఎంపిక చేస్తుంది.
ఈ ప్యానల్లో రతన్ టాటా, వేణు శ్రీనివాస్, అమిత్ చంద్ర, రోషన్ సేన్, కుమార్ భట్టాచార్య ఉన్నారు. ఈ కమిటీ నాలుగు నెల్లలో కొత్త చైర్మన్ను ఎంపిక చేయవలసి ఉంటుంది. రతన్ టాటా ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్గా ఉంటారు.
కాగా, సైరస్ మిస్త్రీ 28 డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్గా ఎంపికయ్యారు. సైరస్ ఎంపిక, ఉద్వాసన రెండూ ఆశ్చర్యమే. ఇతను 4 జూలై 1968లో జన్మించారు. సైరస్ మిస్త్రీ టాటా సన్స్ గ్రూప్కు ఆరో చైర్మన్. అలాగే టాటా పేరు లేని రెండో వ్యక్తి. సైరస్ మిస్త్రీ కంటే ముందు శక్లత్వాలా (టాటా పేరు లేని వారు) చైర్మన్ అయ్యారు.
Comments
English summary
Tata Sons has announced that its board has replaced Cyrus P. Mistry as Chairman of Tata Sons. The decision was taken at a board meeting held here today.