వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనువుగా ఉందని: చంపేసిన తల్లి, మామలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్: ఓ యుకుడితో తన కుమార్తె చనువుగా ఉందని తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా అతనికి దూరం చెయ్యాలని అనుకుంది. చివరికి అపార్థం చేసుకుని కన్న బిడ్డను దారుణంగా చంపేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఓ దళిత వాడలో ఆ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ లోని బలియా గ్రామంలో 18 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. పక్కనే ఉన్న కుర్తియా గ్రామంలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో ఆ యువతి సన్నిహితంగా ఉండేది. విషయం గుర్తించిన యువతి తల్లి పలు సార్లు ఇద్దరిని హెచ్చరించి దూరంగా ఉండాలని చెప్పింది.

Dalit girl killed by mother, uncles in UP

ఆ యువతి మామలు సైతం ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు.అయితే యువతి, యువకుడు కలుస్తుండేవారు. ఇక లాభం లేదని భావించిన యువతి తల్లి తన సోదరులతో కలిసి ఆమెను చంపేయాలని నిర్ణయించారు. చివరికి యువతిని దారుణంగా హత్య చేశారు. విషయం బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అదే గ్రామంలోని ఓ గుడిసెలో గుంత తీసి యువతి శవాన్ని పూడ్చి పెట్టారు. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్పీ మనోజ్ తెలిపారు. హత్య చేసిన యువతి తల్లితో పాటు ఆమె సోదరుల మీద కేసు నమోదు చేశామని, కేసు విచారణలో ఉందని ఎస్పీ మనోజ్ చెప్పారు.

English summary
The body was found by some villagers the same day and police were informed. An FIR against her mother .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X