వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి చేసి, దళిత యువకుడితో మలం తినిపించారు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. సాటి మనిషి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి, వారి చేత బలవంతంగా మలం తినిపించారు.

ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోట్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలో గల బర్కాలీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శనివారంనాడు వెల్లడించారు.

 Dalit youth assaulted, forced to eat human faeces in UP

బాధితుడి సోదరుడు పోలీసులకు సంఘటనపై ఫిర్యాదు చేశాడు. త్యాగి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు 24 ఏళ్ల గోవింద్ అనే వ్యక్తిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి, దాడి చేశారు.

దొంగతనం చేశాడనే అనుమానంతో ఆ యువకుడిని తీసుకుని వెళ్లారు. సీనియర్ పోలీసులు జోక్యంతో ఈ సంఘటనపై శుక్రవారంనాడు కేసు నమోదైంది. ముగ్గురు అగ్రవర్ణ నిందితుల్లో లవకుశ్ త్యాగి, వినోద్ త్యాగి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశఆరు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనరకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A Dalit youth was allegedly assaulted and forced to consume human faeces by three persons at Barkali village under Kotwali police station here, police said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X