దాడి చేసి, దళిత యువకుడితో మలం తినిపించారు
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. సాటి మనిషి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి, వారి చేత బలవంతంగా మలం తినిపించారు.
ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోట్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలో గల బర్కాలీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శనివారంనాడు వెల్లడించారు.
బాధితుడి సోదరుడు పోలీసులకు సంఘటనపై ఫిర్యాదు చేశాడు. త్యాగి కమ్యూనిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు 24 ఏళ్ల గోవింద్ అనే వ్యక్తిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి, దాడి చేశారు.
దొంగతనం చేశాడనే అనుమానంతో ఆ యువకుడిని తీసుకుని వెళ్లారు. సీనియర్ పోలీసులు జోక్యంతో ఈ సంఘటనపై శుక్రవారంనాడు కేసు నమోదైంది. ముగ్గురు అగ్రవర్ణ నిందితుల్లో లవకుశ్ త్యాగి, వినోద్ త్యాగి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశఆరు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనరకంగా ఉన్నట్లు తెలుస్తోంది.