అప్పు కింద పెళైన కుమార్తెను అప్పగించిన తల్లి
మహారాష్ట్ర: తీసుకున్న రుణం చెల్లించలేని ఓ మహిళ వివాహం అయిన తన కుమార్తెను అతనికి అప్పగించింది. రుణం ఇచ్చిన వ్యక్తికి శారీరక సుఖం ఇవ్వాలని కుమార్తె మీద ఒత్తడి తీసుకువచ్చింది.
రుణం ఇచ్చి వివాహిత మీద అత్యాచారం చేసిన ఆంటోని జోసెఫ్ సామ్యూల్ (30) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలోని మన్పాడకు చెందిన ఆంటోని జోసెఫ్ సామ్యూల్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు.
ఇతని దగ్గర ఓ మహిళ రూ. 10 వేలు రుణం తీసుకుంది. ఇటీవలే ఆమె కుమార్తెకు వివాహం చేసింది. అయితే తీసుకున్న రుణం వెంటనే తిరిగి చెల్లించాలని సామ్యూల్ ఆ మహిళ మీద ఒత్తిడి తీసుకువచ్చాడు.
లేదంటే నీ కుమార్తె మీద యాసిడ్ దాడి చేస్తానని, నీ అల్లుడిని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ మహిళ సామ్యూల్ ను ఇంటికి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన సామ్యూల్ కు శారీరక సుఖం ఇవ్వాలని కుమార్తె మీద ఒత్తిడి తీసుకువచ్చింది.
అందుకు కుమార్తె నిరాకరించింది. ఆమె కుమార్తెను, సామ్యూల్ ను ఇంటిలో పెట్టి బయట తాళం వేసింది. విషయం గుర్తించిన ఆమె అల్లుడు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు శామ్యూల్ ను అరెస్టు చేసి అత్యాచారం కేసు నమోదు చేశారు.