టీచర్ను కత్తితో పొడిచి చంపారు: కుటుంబానికి కోటి ఆర్ధిక సాయం
హైదరాబాద్: దేశ రాజధానిలో విద్యార్ధుల చేతిలో చంపబడ్డ ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. తామిస్తున్న డబ్బు ఆ కుటుంబానికి పరిహారంగా చెల్లించడం లేదని, ఆర్థిక సాయమే చేస్తున్నామని డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా ట్విట్టర్లో పేర్కొన్నారు.
हमारी सरकार शिक्षकों का सम्मान करती है और मानती है कि शिक्षक का योगदान भी सीमा पर खड़े सिपाही जैसा ही महान है।
— Manish Sisodia (@msisodia) September 27, 2016
शिक्षक मुकेश कुमार के परिवार को पहुंची क्षति की भरपाई नहीं हो सकती। परिवार को तुरंत आर्थिक मदद के लिए सरकार 1 करोड़ की राशि देगी।
— Manish Sisodia (@msisodia) September 27, 2016
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ప్రభుత్వ స్కూల్లో సోమవారం ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ని తమకు హాజరు వేయలేదనే కారణంతో ఇద్దరు విద్యార్థులు కత్తితో పొడిచారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆ ఉపాధ్యాయుడి కుటుంబం అనుభవించే బాధకు ఎలాంటి పరిహారం సరిపోదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుందని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలా పనిచేస్తాడో అలాగే సమాజానికి గురువు తోడ్పాటు కూడా అంతే ఉంటుందని అన్నారు. కాగా, ముఖేశ్ కుమార్ సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మనీష్ శిశోడియా ఆసుపత్రికి చేరుకొని ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
కానీ ముఖేశ్ కుమార్ పిరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.