వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి ఎంపి దిలీప్సింగ్ భూరియా కన్నమూత
భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దిలీప్సింగ్ భూరియా కన్నుమూశారు. అనారోగ్యంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేరిన దిలీప్సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.
జాభువ(రాట్లం) పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన 1980 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు.
అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాట్లం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొందారు.
కాగా, భూరియా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భూరియా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
English summary
Dileep Singh Bhuria, member of Lok Sabha from Ratlam seat in Madhya Pradesh has died. He was 71.