అడ్డదారిలో పళనిస్వామి గట్టెక్కే ప్రయత్నం, ఆ ముగ్గురిపై స్టాలిన్ నిప్పులు
గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిపై డిఎంకె గౌరవాధ్యక్షుడు స్టాలిన్ సీరియస్ అయ్యారు.అన్నాడిఎంకె అడ్డదారిలో బలాన్ని నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపణడిఎంకె మూడు కీలకమైన తీర్మాణాలను ఆమోదిం
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై డిఎంకె భగ్గుమంంది.తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్రావు, స్పీకర్, ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా డిఎంకె తీర్మాణం చేసింది.
తమిళనాడులో మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం సమావేశమైంది..
అధికార యంత్రాంగం, రాజ్యాంగ పదవుల్ని వారు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అడ్డదారిలో మెజార్టీ నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిఎంకె డిమాండ్ చేసింది.
తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. అన్నాడీఎంకే అడ్డదారిలో మెజార్టీ నిరూపించుకోవాలని చూస్తోందని డిఎంకె ఆరోపించింది.
అన్నాడీఎంకేలోని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసిన అంశంపై కోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత తమ వ్యూహం ఏంటో ప్రకటిస్తామని తెలిపింది.