డీఎంకే పార్టీ సొంత ఇంటిలో పోరు: కళిమొని దూరం: ఎందుకంటే !
డీఎంకే పార్టీలో ఆదిపత్య పోరు మొదలైయ్యిందని మరో సారి వెలుగు చూసింది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమార్తె. ఎంపీ కళిమొని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని.
చెన్నై: డీఎంకే పార్టీలో ఆదిపత్య పోరు మొదలైయ్యిందని మరో సారి వెలుగు చూసింది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమార్తె. ఎంపీ కళిమొని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని వెలుగు చూసింది.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేయాల్సి ఉంది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు.
డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జయలలితకు కంచుకోటగా ఉన్న ఆర్ కే నగర్ నియోజక వర్గంలో కరుణానిధి కుమార్తె కళిమొని ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పటి వరకు కళిమొని ప్రచారం చెయ్యడానికి ఆ పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద డీఎంకే పార్టీలో మరో సారి ఆదిపత్యపోరు మొదలయ్యిందని వెలుగు చూసింది. మొదటి నుంచి స్టాలిన్ తన సోదరి కళిమొనిని దూరం పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.