కరుణానిధికి మళ్లీ అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబసభ్యులు కావేరి ఆస్పపత్రికి తీసుకువెళ్లారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది.
Chennai: Karunanidhi readmitted with breathing difficulty due to throat and lung infection, he is stable & being treated: Hospital statement pic.twitter.com/eFgJ3OEbSA
— ANI (@ANI_news) December 15, 2016
కాగా, గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు.
వారం
రోజుల
పాటు
చికిత్స
పొందిన
అనంతరం
డాక్టర్లు
ఆయన్ను
డిశ్చార్జ్
చేశారు.
కొన్ని
రోజులపాటు
విశ్రాంతి
తీసుకోవాలని
వైద్యులు
సూచించారు.