చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధికి మళ్లీ అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబసభ్యులు కావేరి ఆస్పపత్రికి తీసుకువెళ్లారు.

గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది.

కాగా, గత 15 రోజుల్లో కరుణానిధి రెండవ సారి అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చేరారు.

వారం రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.
కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

English summary
Chief of Dravida Munnetra Kazhagam (DMK), Dr M Karuanidhi has been hospitalised yet again. He was discharged after spending a week in the hospital just eight days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X